కడుపు నొప్పి తాళలేక..

– పురుగులమందు తాగి మహిళ మృతి
నవతెలంగాణ – ఆళ్ళపల్లి (గుండాల)
పురుగుల మందు తాగి ఓ మహిళ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని జగ్గాయిగూడెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గుండాల పోలీస్ స్టేషన్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గాయిగూడెం గ్రామానికి చెందిన పొంబోయిన స్రవంతి (30) గత నెల 16వ తేదీన కడుపులో నొప్పి తాళలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. దాంతో కుటుంబ సభ్యులు ఖమ్మం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో మంగళవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందిందని ఎస్సై తెలిపారు. దాంతో ఎస్సై కిన్నెర రాజశేఖర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love