ఆదర్శ పాఠశాల ప్రవేశాల కోసం ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ 

– ఎడ్లపల్లి మోడల్ స్కూల్ ప్రిన్స్ పాల్ 
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామపరిదిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలోని 2024-25 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశానికి మరియు 7వ తరగతి నుంచి 10వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల ప్రవేశాల కోసం ఎంట్రన్స్ టెస్ట్ కోసం అర్హత గల విద్యార్థులు htt//telangams.cgg.gov.in/  ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని పాటశాల ప్రిన్స్ పాల్ దూడ వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీలకు రూ.125, ఓసీలకు రూ.200 పిజు ఉంటుందన్నారు.దరఖాస్తుల కోసం ఈ నెల 8న నోటిఫికేషన్ విడుదలైనట్లుగా, 12 నుంచి వచ్చే 22 వరకు దరఖాస్తుల స్వీకరణ,6వ తరగతి ప్రవేశం కొరకు రాసే విద్యార్థులకు ఏప్రిల్ 1న పరీక్ష ఉదయం 10 నుంచి  మధ్యాహ్నం 12 వరకు 7వ తరగతి నుంచి 10వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 7న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు  ఎంట్రన్స్ పరీక్ష ఉంటుందన్నారు.
Spread the love