పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన ఉపాధ్యక్షుడుపై చర్యలు తీసుకోవాలి: వెంకటస్వామి గౌడ్

నవతెలంగాణ – మిరుదొడ్డి 
పార్టీ నిబంధనలకు విరుద్ధంగా పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించిన ఉపాధ్యక్షుడు పై చర్యలు తీసుకోవడం జరిగిందని దుబ్బాక నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్ తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్ పేట- భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు గజబింకర్ అశోక్ నగరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడంతో పాటు మిగతా పార్టీలకు ఓటు వేయాలని ప్రచారం చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. మండల నాయకుల సమక్షంలో పార్టీ నుండి గజబింకర్ అశోకుని సస్పెండ్ చేస్తున్నట్లు తీర్మానం చేయడం జరిగిందని మీడియాకు వెల్లడించారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మధు ప్రతాప్ కాంగ్రెస్ నాయకులు రవి, భీమ్రావు, శ్రీధర్బా,ల గౌడ్  తదితరులు పాల్గొన్నారు.
Spread the love