డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు..

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉన్నత విద్యామండలి దోస్త్ మొదటి ఫేజ్ మొదటి సంవత్సరం ప్రవేశాలు ను గురువారం ప్రకటించింది. ఈ క్రమంలో అశ్వారావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు గ్రూపుల్లో 3 విద్యార్ధులు ప్రవేశం పొందినట్లు ఈ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కే.విజయ్ కుమార్ తెలిపారు. బీ.ఎ లో ఇరువురు,ఎస్సీ ఎంపీసీ లో ఒక్కరు చేరినట్లు నవతెలంగాణ కు తెలిపారు. మొదటి ఫేజ్ చేరికలు షెడ్యూల్ గురువారం తో ముగిసాయి అని తిరిగి నేటి నుండే రూ.400 లు రుసుం తో రెండో దఫా రిజిస్ట్రేషన్ మొదలై ఈ నెల 13 వరకు గడువు ఉంటుందని అన్నారు.రెండో ఫేజ్ వెబ్ ఆప్షన్  ఈ నెల 6 నుండి 14 ఉంటుందని అన్నారు.
ఎట్టకేలకు ప్రవేశాలు :
వాస్తవానికి ఈ కళాశాల గతేడాది విద్యా సంవత్సరమే మంజూరు అయినప్పటికీ పరిపాలనా అనుమతులు వచ్చేసరికి దోస్త్ అడ్మిషన్ లు గడువు ముగిసింది.దీంతో ఒక విద్యాసంవత్సరం వృధా అయింది. ఎట్టకేలకు ఈ ఏడాది మూడు అడ్మిషన్ లు రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Spread the love