– రాష్ట్ర ఐటి, పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల
నవతెలంగాణ- మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.మంథని నియోజకవర్గంతోపాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, అష్టఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఆదివారం మంత్రి స్వగ్రామం కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో పర్యటించి మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు నెలనెలా పింఛన్లు ఇచ్చేందుకు కార్యాచరణ చేస్తున్నట్లుగా తెలిపారు.ఇప్పటికే మహిళల కోసం మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేసినట్లుగా తెలిపారు. మహిళల కళ్ళలో ఆనందం చూసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటున్నట్టుగా వివరించారు. ఈ సంక్రాంతి పండుగకు పాడిపంటలు, ప్రజలు ఆనందంగా ఉండాలని స్థానిక రాఘవేంద్రస్వామి ఆలయంలో పూజలు ప్రత్యేక నిర్వహించారు.