జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియామకం..

నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం లో బుధవారం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య కన్నాయి బాబు కి యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియామక ఉత్తర్వులను అందజేశారు. కన్నాయి బాబు మాట్లాడుతూ నియామకానికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదములు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సైదాపురం సర్పంచ్ బీర్ల శంకర్, ఉప సర్పంచ్ దుంబాల సురేఖ వెంకటరెడ్డి, ఎంపీపీ చీర శ్రీశైలం, మండల అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love