కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులుగా జంపాల అంజయ్య నియామకం..

నవతెలంగాణ- చివ్వేంల: చివ్వేంల కాంగ్రెస్  మండల ఉపాధ్యక్షులుగా వట్టి ఖమ్మం పహాడ్ గ్రామానికి చెందిన జంపాల అంజయ్య ను నియమించారు. బుధవారం కాంగ్రెస్  జిల్లా అధ్యక్షులు చెవిటి  వెంకన్న యాదవ్  నియామక పత్రం అందజేశారు. అనంతరం  జంపాల అంజయ్య మాట్లాడుతూ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి  ఆశీస్సులతో కాంగ్రెస్  మండల ఉపాధ్యక్షుడిగా నియమించడానికి సహకరించిన  కాంగ్రెస్  జిల్లా అధ్యక్షులు  చెవిటి వెంకన్న యాదవ్, కాంగ్రెస్  పార్టీ మండల అధ్యక్షులు వీరన్న, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేములపల్లి వాసుదేవ రావు చింతమల్ల  రమేష్, యల్కపల్లి వెంకన్న, వెన్న మధుకర్ రెడ్డి, గోగుల ఈదయ్య, వీరబోయిన మహేష్, వీరబోయిన సైదులు, దొనకొండ మహేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి  గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, పార్టీ అభివృద్ధి కోసం సైనికుడిలా పని చేస్తానని తెలిపారు.
Spread the love