బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన దేవాలయ కమిటీ చైర్మన్ ముత్యాల వెంకన్న

– కాంగ్రెస్ తోనే ప్రజాసంక్షేమ పాలన సాధ్యం
– మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి
నవతెలంగాణ- తుంగతుర్తి:
కాంగ్రెస్ తోనే ప్రజా సంక్షేమ పాలన సాధ్యమని మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన సీనియర్ నాయకులు దుగ్యాల హనుమంతరావు, శ్రీశ్రీశ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ ముత్యాల వెంకన్న, దేవాలయ కమిటీ డైరెక్టర్లు గుజ్జ సురేందర్రావు, చర్లపల్లి రాములు, వార్డు మెంబర్లు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా వారికి కండువాలు కాప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అజయ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love