మాయమాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ను నమ్మొద్దు: ఆయేషా ఫాతిమా

నవతెలంగాణ – నవీపేట్

మాయ మాటలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని నమ్మి మరోసారి మోసపోవద్దని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ సతీమణి ఆయేశ ఫాతిమా అన్నారు. మండలంలోని మోకన్ పల్లి, నారాయణపూర్, జన్నేపల్లి మరియు లింగాపూర్ గ్రామాలలో ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయేషా ఫాతిమా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి, రెండు లక్షల రుణమాఫీ ఇలాంటి పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కాబట్టి కెసిఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అందుకే బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపించాలని అన్నారు. రాజకీయ అనుభవం ప్రశ్నించే గొంతుకైనటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపించి తెలంగాణ గొంతుకను ఢిల్లీలో వినిపించేందుకు ఓట్లు వేసి గెలిపించాలని జడ్పీ చైర్మన్ దాదన్న గారి విటల్ రావు కోరారు. అనంతరం కూలీలకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ రావు, తెడ్డు పోశెట్టి, అబ్బన్న, గొంటి రాజు, జనార్ధన్, అల్లం రమేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.
Spread the love