లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలి : నున్నా

నవతెలంగాణ ఖమ్మం: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకు చరమగీతం పాడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరావు అన్నారు. పింజరమడుగులో సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం నాగభూషణం అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో మతతత్వాన్ని పెంపొందిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్న భాజపాను ఓడించాలన్నారు. మహబూబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుగ్గి కృష్ణ, శ్రీనివాసరెడ్డి, రామచంద్రయ్య కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Spread the love