నల్లగొండ లోక్ సభ నియోజకవర్గ ముఖ చిత్రం

– సీపీఐ ఆరు సార్లు విజయం
– గుత్తా టీడీపీ నుంచి ఒకసారి, కాంగ్రెస్  నుంచి రెండుసార్లు విజయం
నవతెలంగాణ – పెద్దవూర
తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో నల్గొండ ఒకటి. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి లోక్‌సభ నుంచి దాదాపు అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ లేదా టీడీపీ, సీపీఐ, బీజేపీ పార్టీ హవా కనిపించింది. అయినప్పటికీ కూడా అప్పట్లో నల్గొండలో మాత్రం సీపీఐ ఎక్కువసార్లు విజయం సాధించింది. మొదటి లోక్‌సభ నుంచి మూడో లోక్‌సభ వరకు, ఆ తర్వాత పదో లోక్‌సభ నుంచి పన్నెండో లోక్‌సభ వరకు, అనంతరం పద్నాలుగవ లోక్‌సభకు లెఫ్ట్ పార్టీ ప్రాతినిధ్య వహించింది.
1952 నుంచి 2019 వరకు లోక్ సభ గెలిచిన అభ్యర్థుల వివరాలు..
1952లో రావి నారాయణ రెడ్డి (సీపీఐ), 1957లో దేవులపల్లి వెంకటేశ్వర రావు (సీపీఐ), 1962లో రావి నారాయణ రెడ్డి (సీపీఐ), 1967లో కాంగ్రెస్ పార్టీ నుంచి మొహమ్మద్ యూనస్ సలీమ్, 1971లో తెలంగాణ ప్రజా సమితి నుంచి రామకృష్ణారెడ్డి, 1977లో కాంగ్రెస్ నుంచి అబ్దుల్ లతీఫ్, 1980లో కాంగ్రెస్ నుంచి దామోదర్ రెడ్డి గెలిచారు.1984లో టీడీపీ నుంచి రఘుమారెడ్డి విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ నుంచి చకిలం శ్రీనివాస రావు, 1991, 1996లలో సీపీఐ నుంచి బొమ్మగోని ధర్మభిక్షం (రెండుసార్లు), 1998 నుంచి అదే పార్టీ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి గెలిచారు. 1999లో టీడీపీ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి 2004లో సీపీఐ నుంచి సురవరం సుధాకర్ రెడ్డి, 2009, 2014లలో కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఆయన అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
 తెలంగాణ రాష్ట్రంలో(2014)
2014 లోక్‌సభ ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 1,93,156 ఓట్లతో గెలిచారు. గుత్తాకు 4,72,093 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి 2,78,937 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 2,60,677 ఓట్లు వచ్చాయి. ఇక్కడి నుంచి పలుమార్లు గెలుపొందిన సీపీఐ(ఎం) 2014 ఎన్నికల్లో కేవలం 54,423 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. చివరిసారి 2004 గెలిచిన సీపీఐ(ఎం) 2009లో రెండోస్థానానికి, 2014లో నాలుగోస్థానానికి పడిపోయింది.
నల్గొండ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఓటర్లు
నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 14,95,580 మంది ఓటర్లు ఉన్నారు. 7,47,281 మంది పురుష ఓటర్లు, 7,48,299 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2014లో 11,89,399 మంది ఓట్లు వేశారు. 80 శాతం ఓటింగ్ నమోదయింది. పురుషులు 6 లక్షలకు పైగా, మహిళలు 5,87వేలకు పైగా ఓట్లు వేశారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం జనాభా 20,43,419. గ్రామీణ జనాభా 76.24 శాతం, పట్టణ జనాభా 23.76 శాతంగా ఉంది. అప్పటి ప్రస్తుత ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయన 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీడీపీ నుంచి ఒకసారి, కాంగ్రెస్ నుంచి రెండుసార్లు.. మొత్తం మూడుసార్లు విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
2019 లో లోక్ సభ కు పోటీ చేసిన అభ్యర్థులు
2019 నల్గొండ పార్లమెంట్ ఎన్నిక లో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.అందులో కాంగ్రెస్ పార్టీనుంచి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి వేమిరెడ్డి నర్సిహమ్మా రెడ్డి, బీజేపీ నుంచి గార్లపాటి జితేందర్ కుమార్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మల్లు లక్షి బరిలో వున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నలమాద ఉత్తం కుమార్ రెడ్డికి 5,55,08 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహామ్మ రెడ్డి కి 500120 ఓట్లు, బీజేపీ అభ్యర్థి గార్లపాటి జితేందర్ కుమార్ కు 52559ఓట్లు, సీపీఐ(ఎం) అభ్యర్థి మల్లులక్ష్మి కి 25062 ఓట్లు నమోదయ్యాయి. ఈ ఎన్నిక లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి పై 4488 స్వల్ప ఓట్ల మెజారిటీ సాధించి విజయం సాధించారు. అందులో 13 మంది ఇండిపెండెంట్, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ(ఎం), జనసేన, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, బహుజన ముక్తి పార్టీ, అంబేద్కర్ జాతీయ కాంగ్రెస్, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా, తెలంగాణ సకల జనుల పార్టీ, బహుజన రాజ్యం పార్టీల నుంచి ఒక్కొక్కరు పోటీ లో వున్నారు. వీరందరు డిపాజిట్లు కోల్పోయారు.
ఉమ్మడి నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలో
నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య 12 మొత్తం 1,455,016 మంది ఓటర్లను కలిగి ఉంది, వీరిలో 720,289 మంది పురుషులు, 734,727 మంది మహిళలు ఉన్నారు, భారత ఎన్నికల సంఘం 2009 డేటా సూచించింది. 2001 జనాభా లెక్కల ప్రకారం, ఈ పార్లమెంటరీ నియోజకవర్గం జనాభా 110,651. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడం, దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటైన నాగార్జున సాగర్ కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది. నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం యొక్క పరిమాణం మరియు నిర్మాణం ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 4లో వివరించబడింది. ఈ పార్లమెంటరీ నియోజకవర్గం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మెజారిటీ పర్యాయాలు గెలిచింది. నల్గొండ జిల్లా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తిరుగుబాటు చరిత్రను కలిగి ఉంది, ఈ కాలంలోని భీకర పోరాటాలలో ఒకటి. రెడ్ కారిడార్‌లో భాగంగా, నల్గొండ జిల్లాలో భీమిరెడ్డి నరసింహా రెడ్డి, రావి నారాయణ రెడ్డి వంటి ప్రముఖ నాయకులు, ఫ్యూడల్ సెర్ఫోడమ్‌ను వ్యతిరేకిస్తూ తమ జీవితాలను త్యాగం చేసిన మల్లు స్వరాజ్యం వంటి మహిళలు ఉన్నారు. ఈ జిల్లా దేశంలోని 250 ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా గుర్తింపు పొందింది, అయినప్పటికీ నాగార్జున సాగర్ నీటిపారుదల ప్రాజెక్ట్, అలిమేనేటి మాధవ రెడ్డి ప్రాజెక్ట్ వంటి కొన్ని ప్రధాన ప్రాజెక్టులు ఇక్కడ అభివృద్ధి చెందాయి. ఇది బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ ప్రోగ్రామ్ కింద నిధులు సమకూరుస్తోంది.
నల్గొండ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
2009 ఎన్నికల ఫలితాలలో 543 స్థానాలకు గాను యుపిఏ దాదాపు 261 స్థానాలను గెలుచుకుంది, మరియు రెండవ స్థానంలో ఎన్డీఏ 158 సీట్లతో ఉండగా, 23 స్థానాలను లెఫ్ట్ పార్టీలు గెలుచుకున్నాయి. 2014 ఎన్నికల ఫలితాల్లో 543 స్థానాలకు గానూ బీజేపీ 282 సీట్లు గెలుచుకుంది. దీంతో లోక్‌సభలోని 543 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమి 336 స్థానాలకు చేరుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ 44 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది, రెండవ స్థానంలో కొనసాగింది, తమిళనాడు నుండి అన్నాడీఎంకే పార్టీ 2014 లోక్‌సభ ఎన్నికలలో 37 స్థానాలతో మూడవ స్థానంలో నిలిచింది. 2019 లో, లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ భారీ విజయం సాధించి, బీజేపీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చింది. 17వ లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ద్వయం సారథ్యంలోని పార్టీ 303 స్థానాలను కైవసం చేసుకుంది. ఇంతలో, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ 2014 నుండి కేవలం 52 సీట్లతో తన ఓట్ల శాతాన్ని కొద్దిపాటి ఓట్లతో మాత్రమే పెంచుకోగలిగింది.

Spread the love