ఓటు మనదే సీటు మనదే కలిసుంటే రాజ్యాధికారం

నవతెలంగాణ – చండూరు: ఓటు మనదే సీటు మనదే కలిసుంటే రాజ్యాధికారం మనదే అని స్వతంత్ర అభ్యర్థులు మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ ఇన్ చార్జి జిల్లా వెంకటేష్ మాదిగ, ఎమ్మెస్ జాతీయ నాయకులు చైర్మన్ మల్గ యాదయ్య, ప్రధాన కార్యదర్శి నెల్లికంటి రాఘవేంద్ర యాదవ్ లు అన్నారు. మంగళవారం స్థానిక చౌరస్తాలో మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ నియోజకవర్గ అధ్యక్షులు నారపాక అంజి మాదిగ ఆధ్వర్యంలో చండూరు మండల కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్ధులు, పలువురు నేతలు హాజరై మునుగోడు అభివృద్ధిలో భాగంగా వెనుకబడిందని మాట్లాడారు. మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ మునుగోడు నియోజకవర్గంలో ప్రతి గడపగడపకు గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం బీసీ అభ్యర్థులను ఎంచుకొని ప్రతి ఒక్కరు ఓటు మనవాళ్ళకి వేయాలని కోరారు. తమన్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆచ్చిన శ్రీనివాసులు, అవ్వారి వేణు కుమార్, పేపర్ వెంకట్ రెడ్డి, బుషిపాక వెంకటయ్య, మెగావత్ చంద్ర నాయక్, నూనె సురేష్, పూదరి సైదులు, మంగి మహేష్ నరసింహ ఆనంద్ లు పాల్గొన్నారు.

Spread the love