వజ్రఖండి ప్రభుత్వ పాఠశాలలో బడిబాట..

నవతెలంగాాణ – జుక్కల్
మండలంలోని వజ్రఖండి గ్రామములోని ఎంపిపీయబఎస్  పాఠశాలలో హెచ్ఎమ్  కాంబ్లే సాయులు ఆధ్వర్యంలో  బడిబాట కార్యక్రమం ఘణంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఉపాద్యాయ బృందం విద్యార్థుతో  కలిసి గ్రామములో  ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి  బడుయూడు పిల్లలకు ఖచ్చితంగా పాఠశావకు పంపాలని, పిల్లలతో పనులు చేయించరాదని, బాలకార్మీక వ్వవస్థ నిర్మూలించాలని అవగాహన చేసారు. అనంతరం పాఠశాలలో ఒకటవ తరగతి విద్యార్థులతో ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లి దండ్రులు కలిపి అక్షరబ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో  గ్రామస్తులు,  హెచ్ఎం సాయులు,   ఉపాద్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Spread the love