బూత్ కమిటీ సభ్యులతో సమావేశమైన బహుజన్ సమాజ్ పార్టీ

ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్
నవ తెలంగాణ- ఆత్మకూరు ఎస్ :
 మండలం నేమ్మికల్ గ్రామంలోని ఎస్ ఎస్ ఫంక్షన్ హాల్ లో  మండలంలోని అన్ని  గ్రామాల బూత్ కమిటీల నాయకులతో గురువారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సూర్యాపేట బిఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్  మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఒక సైనికుని ల పని చేయాలని కోరారు. బూతు స్థాయి నాయకుల పనితీరు వల్లనే గెలుపు ఆధారపడి ఉంటుందని తెలిపారు. తాను గెలిస్తే బహుజన బిడ్డలందరూ గెలిచినట్టేనని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త కు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 90 శాతం ఓటర్లు ఉన్న మనం 10% ఓటర్ల కింద పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఈ విధానం పోవడానికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేసి ఏనుగు గుర్తుకు ఓటు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ లింగ నాయక్, మైనార్టీ జిల్లా అధ్యక్షులు చాంద్ పాషా, బీఎస్పీ నాయకులు బోల్లి సైదులు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దాసరి నరేష్ నాయుడు, మండల అధ్యక్షులు మధు మహదేవ్, ఆకారపు నిరంజన్, భారీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love