ముంబయి: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో తాజాగా బజాజ్ పల్సర్ మేనియా మాస్టర్స్ ఎడిషన్ను నిర్వహించినట్లు తెలిపింది. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి 100 నగరాల నుంచి 2500పైగా మంది హాజరయ్యారని పేర్కొంది. ఇందులోని ప్రముఖ కళాకారులచే స్పెల్ బౌండింగ్ ప్రదర్శనలు, మైమర్చిపోయే స్టంట్ షోలు, వివిధ వినోద కార్యక్రమాలు వీక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయని ఆ సంస్థ తెలిపింది.