నవతెలంగాణ – హైదరాబాద్: టీం ఇండియా హెడ్ కోచ్ పదవికి షార్ట్లిస్ట్ అయిన గౌతమ్ గంభీర్కు ఈరోజు ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో ఇంటర్వ్యూ జరగనుంది. ఆయనతో పాటు షార్ట్ లిస్ట్ అయిన మరో వ్యక్తిని కూడా క్రికెట్ అడ్వైజరీ కమిటీ ప్రశ్నించనుంది. అయితే ఇది లాంఛనమేనని, గంభీర్ ఎంపిక దాదాపు ఖరారైనట్లేనని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎల్లో కేకేఆర్, లక్నో జట్లను ఆయన విజయపథంలో నడిపించారు.