బీజేపీకి భారీ శాక్

నవతెలంగాణ -పెద్దవూర: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పులిచర్ల గ్రామ పంచాయతీ లోని ఊట్లపల్లి గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు వాసుదేవుల జితేందర్ ఆధ్వర్యంలో 40 కుటుంబాలు బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సోమవారం నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జయవీర్ కుందూరు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ గత 20 ఎడ్లుగా బీజేపీ లో పని చేసున్న తననకు తగిన గుర్తిపంపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బారతీయ జనతా పార్టీ లో పార్టీ బలోపితం కోసం అహర్నిశలు పని చేసినా తగిన గుర్తింపు రావడం లేదని అన్నారు. మండలం లో బిజేపి అభివృద్ధి కొరకు ఎంతో సేవ చేశానని ఇప్పుడు మనో వేదన తో పార్టీ మారవలసి వచ్చిందని అన్నారు. నాకు పార్టీ మీద అభిమానం వున్న స్థానిక లీడర్లు తమకు గుర్తింపు ఇవ్వలేదని అన్నారు. అందుకే పార్ మారడం జరిగిందని తెలిపారు. జానారెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు డిక్లరేషన్లు ప్రజలకు అసరిగా నిలుస్తాని ఆకర్షంచి కాంగ్రెస్ పార్టీ లోచేరానని తెలిపారు.

Spread the love