- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బెంగళూరు నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానాన్ని (6E 6283) ఓ పక్షి ఢీకొట్టింది. శనివారం నాడు సంబంధిత వర్గాలు తెలిపాయి. పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి బే (bay)కు మళ్లించారు. ఇంజనీర్లు విమానాన్ని తనిఖీ చేసి, అది కార్యకలాపాలకు సిద్ధంగా ఉందని ధృవీకరించారు. అయితే గంటకు పైగా ఆలస్యంగా విమానం తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సదురు వర్గాలు పేర్కొన్నాయి.
- Advertisement -



