నవతెలంగాణ – తిరుమల : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం తిరుమల చేరుకున్న బ్రహ్మానందం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలో రంగనాయకుల మండపంలో ఆయనను అర్చకులు ఆశీర్వదించారు. ఆయనకు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం నుండి బయటికి వచ్చిన బ్రహ్మానందంను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అనంతరం ఆయనతో సెల్ఫీలు దిగారు.
Related posts:
కార్పోరేట్ల-మతపరమైన సంబంధాలు ఉన్నా.. వివరాలు వెల్లడించాల్సిందే : సుప్రీం
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..
లోక్సభ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
జొమాటో మళ్లీ ఎరుపు రంగు దుస్తుల్లోనే డెలివరీ..
భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీపీఐ(ఎం)