గడప గడపకు బీఆర్ఎస్ ప్రచారం

నవతెలంగాణ – తిరుమలగిరి 
తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్  ఆదేశానుసారం భువనగిరి పార్లమెంట్ బి.ఆర్.ఎస్ అభ్యర్థి క్యామా మల్లేష్  గెలుపు కోసం తిరుమలగిరి మండలం గుండేపురి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ కుమార్, జడ్పిటిసి దూపటి  అంజలి రవీందర్, మండల కార్యదర్శి తెడ్డు భాస్కర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ మోడెపు సురేందర్, కందుకూరి బాబు, బర్ల వెంకన్న, ఎస్టీ సెల్ అధ్యక్షులు యాకూబ్ నాయక్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పానుగంటి నరసింహారెడ్డి, సర్పంచ్ పాక వెంకన్న, కొమ్ము బిక్షం, మేడిదే శీను, జానీ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love