బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి కుమారుడి వాహనంపై దాడి

Sunitha Laxma reddyనవతెలంగాణ – మెదక్: జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కౌడిపల్లి మండలంలోని లింగంపల్లి బిట్ల తండాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి కుమారుడి వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Spread the love