తిరుమలలో భక్తుల రద్దీ

ttd-sensational-decisionనవతెలంగాణ-హైదరాబాద్  : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (గురువారం) తిరుమల శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం స్వామివారిని 75,059 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారికి 27,411 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Spread the love