నవతెలంగాణ – చండూర్ : మెజార్టీ ఎంపిటిసి సభ్యులు ఉన్న చండూరు ఎంపీపీ ఎన్నుకొక పోవటం బి ఆర్ ఎస్ పార్టీ చేతగాని తనానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ కస్తాల ఎంపిటిసి నాతాల వనజ విమర్శించారు. శనివారం విలేకర్లతో మాట్లాడుతూ మొదటి రోజు ఐదుగురు సభ్యులు హాజరుకగా కోరం లేక ఎంపీపీ ఎన్నిక వాయిదా వేశారని,మరుసటి రోజు ఒక్కరు కూడా హాజరుకాకపోవటం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. బి ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు తమ అంతర్గత విభేదాలను పక్కన పెట్టి ఎంపీపీ ఎన్నికకు సహకరిస్తే ప్రజలు హర్షించేవారన్నారు. ఎంపీపీ ఎన్నికల్లో అలసత్వం వహించిన బిఆరెస్ నాయకులకు ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని ఆమె అన్నారు.