తొగుట ఎల్లారెడ్డిపేట పిల్లలను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు..

నవతెలంగాణ-తొగుట
తల్లి తండ్రుల అకాల మరణంతో అనాధలుగా మారిన పిల్లలకు అండగా నిలుస్తామని సొసైటీ చైర్మన్ కే. హరికృష్ణా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డిలు భరోసా ఇచ్చారు. బుధవారం మండలంలోని ఎల్లారెడ్డి పేట గ్రామానికి చెందిన కెమ్మసారం నాగరాజు, భాగ్య ల పిల్లలను పరామర్శించారు. కే హరికృష్ణా రెడ్డి రూ. 10 వేలు, జీడి పల్లి రాంరెడ్డి రూ. 5 వేలు, మాజీ ఎంపీటీసీ వేల్పుల స్వామి రూ. 5 వేలు, సర్పంచ్ పాగాల కొండల్ రెడ్డి రూ. 5 వేలు, సిద్దిపేట కు చెందిన విఎల్ఆర్ కన్ స్ట్రక్షన్ రూ. 3 వేలు అందించారు. ఆర్ధిక ఇబ్బం దులు తాళలేక ఆదివారం భార్య, భర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భార్యభర్తల అకాల మరణంతో నలుగురు పిల్లలు మీనాక్షి, మహేష్, లక్కీ, శ్రవన్ ఆనాధలయ్యారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు చిన్నారులను  పరామర్శించారు.
అనంతరం వారు మాట్లాడుతూ కరువు కాటకాలు ఏర్పడటంతో ప్రజలకు ఉపాధి కరువు వలన విపత్కార ఆరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. తెలంగాణ లో మళ్లీ ఆత్మహత్య లు, ఆకలి చావులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సహాయం అందించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలోనే కేమ్మసారం నాగరాజు కు  డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడం కేటాయించారని పేర్కొన్నారు. దంపతుల ఆత్మహత్య, చిన్నారులు ఆగ మైన విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరామర్శించిన వారిలో గ్రామ పార్టీ అధ్యక్షులు నందారం వెంకట్ గౌడ్, కుమార్, ప్రభా కర్ రెడ్డి, కిషన్, రాకేష్, బండారు స్వామి గౌడ్ తదితరులు ఉన్నారు.
Spread the love