మెడలో బీఆర్ఎస్ కండువా..గుండెల్లో కాంగ్రెస్..

– విలేకరుల ఎదుట జై కాంగ్రెస్ అని నోరు కరుచుకున్న చెల్మెడ..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ బీఆర్ఎస్ ఇంచార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు నోటా జై కాంగ్రెస్ అనే రాగానే బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఒకసారి గా అవాక్అయ్యారు. లేఅవుట్, రెగ్యులరేషన్ స్కీం ను కాంగ్రెస్ హామీ నిలబెట్టుకొని ,అమలు చేయాలని బుధవారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.. అనంతరం విలేకరులతో  మాట్లాడుతూన లక్ష్మీ నరసింహారావు నోట జై కాంగ్రెస్ అని నోరు కర్చుకున్నారు.. ఆయన వెనకాల నిలబడిన నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు నవ్వులే.. నవ్వులు.. చెల్మెడ లక్ష్మీనరసింహారావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉండడం.. బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం.. వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు స్థానికంగా ఉండకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెల్మెడకు 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం.. కాంగ్రెస్ నుండి ఆది శ్రీనివాస్ గెలవడం, బిఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.. బిఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో వారి వారి రాజకీయ భవిష్యత్తు కోసం రాష్ట్రంలో, జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ కాంగ్రెస్లో ఒక్కొక్కరు హస్తం గూటికి చేరుతున్న విషయం తెలిసిందే.. చల్మెడ మెడలో బిఆర్ఎస్ కండువా – గుండెల్లో కాంగ్రెస్ అని బిఆర్ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్ పార్టీ లో చేరడం పక్కా అని బిఆర్ఎస్ లోని ఒక వర్గం  చర్చించుకుంటున్నారు.
Spread the love