బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం

నవతెలంగాణ – భిక్కనూర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ చేసిన అనుచితమైన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం, పదవీ లేక పిచ్చి పట్టి ముఖ్యమంత్రిపై నీచమైన వాక్యాలు చేస్తున్నారని, త్వరలోనే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. వాఖ్యలు చేసేముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కమిటీ చైర్మన్ దశరథం, మండల జనరల్ సెక్రెటరీ భూపాల్, నాయకులు అమృతరావు, శ్రీనివాస్, రాజు, స్వామి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love