బొగతలో పర్యాటకుల సందడి..

నవతెలంగాణ-హైదరాబాద్ : ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగార బొగత జలపాతం ఆదివారం పర్యాటకులతో పోటెత్తింది. బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుతున్నది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా.. ఆంధ్ర రాష్ట్రం, ఛతీస్ గడ్ రాష్ట్రాల నుండి కూడా పర్యాటకులు అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. జలపాతం వద్ద ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతూ సందడి చేశారు. వ్యూపాయింట్‌ వద్ద కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ బొగత అందాలను కెమెరాలు, సెల్‌ఫోన్లలో బంధించుకున్నారు. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో తరలివచ్చిన పర్యాటకులు బొగత జలపాత ప్రాంగణంలో రోజంతా గడిపి విందులు, వినోదాలతో ఆనందం పొందుతున్నారు.

Spread the love