రైతు రుణమాఫీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్..

నవతెలంగాణ – హైదరాబాద్: పంట రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9వ తేదీ లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ క్యాబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా రుణమాఫీ అమలుపై నిర్ణయం తీసుకుంటూ రైతులకు శుభవార్త చెప్పింది. క్యాబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Spread the love