Thursday, June 4, 2026
E-PAPER
Homeజాతీయంపెట్రోల్ పంపు వద్ద కారులో మంట‌లు

పెట్రోల్ పంపు వద్ద కారులో మంట‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్‌లోని జెహానాబాద్‌లో ఒక పెట్రోల్ పంపు వద్ద కారుకు నిప్పంటుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంట‌ల ధాటికి కారు పూర్తిగా ద‌గ్ధ‌మైంది. భ‌యాందోళ‌న‌ల‌తో వాహ‌న‌దారులు ప‌రుగులు తీశారు. అగ్నిమాప‌క సిబ్బందికి సమాచారం అంద‌క సంఘ‌ట‌న స్థలానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు.ఈ ప్ర‌మాదానికి సంబంధించిన వివ‌రాలు తెలియాల్సింది. గత మే నెలలో, బీహార్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో జయనగర్-ఉధ్నా అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌లోని ఖాళీ కోచ్‌లలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటల్లో దెబ్బతిన్న కోచ్ పూర్తిగా కాలిపోవడంతో, కేసు న‌మోదు చేసుకున్న ఉన్న‌తాధికారులు దర్యాప్తు జ‌రుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -