- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని శనిగరం గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన ప్రమాదవశాత్తు కారు బోల్తా పడింది.హైదారాబాద్ నుండి పెద్దపల్లికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒకరికి తీవ్ర గాయాలవ్వగా..చిన్నారులకు స్వల్ప గాయాలైయ్యాయి.బాధితులను 108 అంబులెన్స్ లో కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

- Advertisement -



