Wednesday, July 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో లారెన్స్‌ బిష్ణోయ్‌పై కేసు

అమెరికాలో లారెన్స్‌ బిష్ణోయ్‌పై కేసు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌-కెనడా దౌత్యసంబంధాల్లో ఒడుదొడుకులకు దారితీసిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్ నిజ్జర్ హత్యకేసులో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతడి సహచరుడు గోల్డీబ్రార్‌పై అమెరికాలో కేసు నమోదైంది. నిజ్జర్‌ను హత్యచేయాలని వారి నుంచి ఆదేశాలు అందాయని అమెరికా దర్యాప్తు అధికారులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. యూఎస్‌కు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అంతర్జాతీయస్థాయిలో ‘ఆపరేషన్ హార్డ్‌బాల్‌’ను చేపట్టింది. దానిలో భాగంగా అమెరికా, కెనడా, ఐరోపావ్యాప్తంగా బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన 24 మంది మంది అనుమానితులు అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలోనే బిష్ణోయ్, గోల్డీబ్రార్‌ అభియోగాలు నమోదయ్యాయి. గోల్డీపై 50,000 డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -