గుట్కా విక్రయ దారుడు పై కేసు నమోదు

నవతెలంగాణ – అశ్వారావుపేట : నిషేదిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న ఓ దుకాణం పై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. స్థానిక ఎస్ఐ శ్రీను తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వినాయకపురం లోగల గరికపాటి నాగరాజు తన కిరాణ దుకాణంలో గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.5390 రూపాయాల విలువైన నిషేదిత గుట్కా ప్యాకెట్లు లభ్యం కాగా, నాగరాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Spread the love