కామ్రేడ్ పర్స శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి: అర్జున్

నవతెలంగాణ – అశ్వారావుపేట
కార్మిక ఉద్యమ నిర్మాత,స్వాతంత్ర్య సమర యోధులు,తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ పర్స సత్యనారాయణ శతజయంతి సందర్భంగా మే 31 నుండి జూన్ 1 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం అయిన కొత్తగూడెం  లో జరుగు జిల్లా సదస్సు  ను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ పిలుపునిచ్చారు. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో స్థానిక హమాలీ అడ్డ ,గ్రామ పంచాయతీ కార్మికులు వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మిక నాయకుడిగా ఆ సంఘాన్ని స్థాపించి కార్మిక హక్కులు కై పోరాడిన యోధుడు అని,నాడు ఎమ్మెల్యేగా పీడిత ప్రజల గొంతు కై ప్రజావాణి వినిపించిన ఆదర్శ ప్రజా ప్రతినిధి కామ్రేడ్ పర్స సత్యనారాయణ అని అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు ,శ్రామిక మహిళలు,స్కీం వర్కర్ల హక్కుల కోసం సమరశీల పోరాటాలకు నాయకత్వం వహించారని అన్నారు. పర్స సత్యనారాయణ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 31 జూన్ ఫస్ట్ తేదీలలో కొత్తగూడెంలో సమకాలీన రాజకీయ ఆర్థిక అంశాలతో పాటు కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పైన స్మారక సదస్సు ని సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కన్వీనర్ కె. నరసింహారావు,టి రాంబాబు,రమేష్,బుజ్జమ్మ,సీత తదితరులు పాల్గొన్నారు.
Spread the love