కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

నవతెలంగాణ – హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనానికి కేంద్రం అనుమతిచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతోనే ఇది సాధ్యమైందని తెలిపింది. CM రేవంత్ ఆదేశాలతో మార్చి 6న కేంద్రానికి లేఖ రాస్తే సానుకూలంగా స్పందించి కంటోన్మెంట్‌పై అధికారాలు GHMCకి అప్పగించినట్లు వెల్లడించింది. ఇది ప్రజా ప్రభుత్వ విజయమని పేర్కొంది.

Spread the love