విరాళం ప్రకటించిన బుసిరెడ్డి ఫౌండేష్ ఛైర్మెన్..

– దుగ్గెపల్లిలో నిర్మాణంలో వున్న రామాలయాన్ని సదర్శించిన పాండు రంగారెడ్డి
– మానవసేవే మాధవ సేవ అంటున్న ఛైర్మెన్
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, త్రిపురారం మండలం, దుగ్గేపల్లి గ్రామంలోని పెద్దల ఆహ్వానం మేరకు రామాలయాన్ని సోమవారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి నిర్మాణంలో ఉన్న రామాలాయాన్ని సందర్శించారు. తదనంతరం గ్రామపెద్దల కోరిక మేరకు దేవాలయ నిర్మాణానికి తనవంతు విరాళం ప్రకటించారు. ఈసందర్బంగా  మాట్లాడుతూ.. ప్రతి ఊరిలో గుడి,బడి వుంటేనే ఆ గ్రామం బాగుపడుతుందని అందరూ హిందూ ఆచార, వ్యవహారాలు పాటిస్తారని అన్నారు.అదేవిధంగా గ్రామంలోని పిల్లలు, పెద్దలు అందరూ భక్తి భావంతో కలిగివుండాలని కోరారు. ఇక్కడకి విచ్చేసిన గ్రామంలోని ప్రజలందరికీ నా ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయని ధనిక, పేద తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, పెద్దిరెడ్డి నరోత్తం రెడ్డి,బుసిరెడ్డి శ్రీనివాసరెడ్డి,మేకల జెమిని,మేకల వెంకటయ్య,మేకల మల్లేష్,కుక్కలగిరి ఊటబాబు, దోరేపల్లి రాములు,అనుముల కోటేష్, గజ్జల శివానంద రెడ్డి,ఇస్రం లింగస్వామి,కున్ రెడ్డి సంతోష్ రెడ్డి,అబ్దుల్ కరీం మరియు తదితరులు పాల్గొన్నారు.
Spread the love