బాధిత కుటుంబాలకు చల్మెడ పరామర్శ..

నవతెలంగాణ – వేములవాడ రూరల్ 
వేములవాడ మున్సిపల్ పరిధి ఇస్లాం నగర్ కు చెందిన షేక్ ఇమామ్  కొద్ది రోజుల క్రితం బావుపేట గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు గ్రానైట్ పడి తుంటి ఎముక విరగడం జరిగింది.  ఈ విషయం  తెలుసుకున్న వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహరావు  ఆదివారం ఇస్లాంనగర్ కు చేరుకొని గాయపడిన షేక్ ఇమామ్ ను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే తనను సంప్రదించాలని, తన ఆసుపత్రిలో వైద్యం చేయిస్తానని హామి ఇచ్చారు.  అలాగే  5వ వార్డు గొల్లపల్లికి చెందిన జెట్టి నర్సయ్య ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను  డాక్టర్ శ్రీనివాస్ తో కలిసి పరామర్శించారు. వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. వారి వెంట బిఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీనివాస్ , ఇస్లాంనగర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు షేక్ గొరేమియా, షేక్ అలీ,సయ్యద్ హైదర్ , గ్లోబల్ యూత్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ రహమాన్, అక్బర్,రషీద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love