
కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా వివిధ పదవుల్లో నియమ నిబద్ధతతో పనిచేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించటం అభినందనీయమని యువజన కాంగ్రెస్ చౌటుప్పల్ పట్టణ మాజీ అధ్యక్షులు చెరుకు లింగస్వామి గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు అధిష్టానం సరైన గుర్తింపు ఇస్తుందని, అనడానికి నిదర్శనం చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించడం అని అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు.చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.