రాష్ట్రపతి భవన్ లో చండూరు చేనేత కళాకారుల ప్రతిభా ప్రదర్శన

– రాష్ట్రపతికి వివరించిన జాతీయ అవార్డు గ్రహీత గంజి యాదగిరి,జాతీయ మెరిట్ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసులు 
నవతెలంగాణ – చండూరు
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో బుధవారం   చేనేత కళాకారుల ఉత్పత్తుల   ప్రదర్శనలతో కూడిన వివిధత్ కా అమృత మహోత్సవ  కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 20 మంది చేనేత హస్త కళాకారులు ఈ ప్రదర్శనకు ఎంపిక కాగా  నల్గొండ జిల్లా చండూరు కి చెందిన జాతీయ అవార్డు గ్రహీత గంజి యాదగిరి,జాతీయ మెరిట్ అవార్డు గ్రహీత  చిలుకూరు శ్రీనివాసులు ఉండడం విశేషం. తమ నైపుణ్యంతో తయారు చేసినటువంటి చేనేత ఉత్పత్తులను ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కు అలాగే రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మకు అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు స్వయంగా వివరించారు. ఈ చేనేత కళాకారుల ఉత్పత్తులను చూసి ప్రముఖులంతా  ఎంతగానో అభినందించారు. గంజి యాదగిరి చిలుకూరు శ్రీనివాసులు  జాతీయస్థాయిలో ప్రతిభ చాటడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులపాటు ప్రదర్శన జరగనుంది.
Spread the love