నవతెలంగాణ డిచ్ పల్లి.
తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చటం అంటే తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతియటమేనని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కి వినతి పత్రం తే.యూ పి.డి.ఎస్.యూ ఆద్వర్యంలో అందజేశారు.ఈ సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ అనే పదం ఉద్యమానికి ప్రతీక, చిరస్మరణీయమైనటువంటి పేరును మార్చి ఈశ్వరి బాయి యూనివర్సిటీ గా మార్చలని చూడటం సరైంది కాదని ,సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలంగాణ పేరును మార్చటం అంటే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతియటమే అన్నారు.
ఎంతో మంది త్యాగాలు, త్యాగాల గాయాలు, ఉద్యమ స్పూర్తి కలిగిన తెలంగాణ పేరును అలాగే ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజమాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అనేక ఉద్యమాలు చేశామని కేసులు అయ్యాయని, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ల తల్లిదండ్రుల పేర్లు ప్రభుత్వ సంస్ధలకు పెట్టుకోవడం పద్ధతి కాదని విమర్శించారు. ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రం పేరుతో అనేక యూనివర్సిటీలు దేశంలో ఉన్నాయని, మన రాష్ట్రంలో ఏకైక యూనివర్సిటీకి తెలంగాణ అని పేరు ఉందని దీన్ని కూడా మారిస్తే చరిత్ర కలిగిన రాష్ట్రానికి అవమానకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యునివర్సిటీ పేరు మార్చే ఆలోచనను విరమించుకోవాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తే.యూ పి డి ఎస్ యూ నాయకులు ప్రిన్స్, దేవిక, రవీందర్, రాకేష్, హుస్సేన్, సాత్విక, గౌతం, బిమేశ్,తదితరులు పాల్గొన్నారు.
ఎంతో మంది త్యాగాలు, త్యాగాల గాయాలు, ఉద్యమ స్పూర్తి కలిగిన తెలంగాణ పేరును అలాగే ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజమాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అనేక ఉద్యమాలు చేశామని కేసులు అయ్యాయని, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ల తల్లిదండ్రుల పేర్లు ప్రభుత్వ సంస్ధలకు పెట్టుకోవడం పద్ధతి కాదని విమర్శించారు. ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రం పేరుతో అనేక యూనివర్సిటీలు దేశంలో ఉన్నాయని, మన రాష్ట్రంలో ఏకైక యూనివర్సిటీకి తెలంగాణ అని పేరు ఉందని దీన్ని కూడా మారిస్తే చరిత్ర కలిగిన రాష్ట్రానికి అవమానకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యునివర్సిటీ పేరు మార్చే ఆలోచనను విరమించుకోవాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తే.యూ పి డి ఎస్ యూ నాయకులు ప్రిన్స్, దేవిక, రవీందర్, రాకేష్, హుస్సేన్, సాత్విక, గౌతం, బిమేశ్,తదితరులు పాల్గొన్నారు.