తొగుట మండల స్థాయి క్రీడలు ప్రారంభించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి, తొగుట సిఐ

– మండల స్థాయి క్రీడలు ప్రారంభించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి, తొగుట సిఐ
నవతెలంగాణ – తొగుట
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరకు శ్రీనివాస్ రెడ్డి, తొగుట సిఐ కమలాకర్ అన్నారు. ఆది వారం మండలంలోని కాన్గల్ గ్రామానికి,కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు ముడికే స్వామి యాదవ్ తన తండ్రి క్రీ,శే,ముడికె రాజయ్య జ్ఞాప కార్థం వాలీబాల్ క్రీడలు నిర్వహించారు.ఈ క్రీడలు ప్రారంభానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం పెంపోదించుకోవలని సూచించారు. యువత నిత్యజీవితంలో క్రిడలు  ఒక దినచర్యగా భావించాలని అన్నారు. మండల స్థాయి నుండి 12 జట్లు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దోమల కొమురయ్య,పిఏసీఎస్ డెరెక్టర్ మహిపాల్ రెడ్డి,
బీజేపీ జిల్లా పధాన కార్యదర్శి విభిషన్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ పిట్ల సత్తయ్య,కాంగ్రెస్ మండల అధ్య క్షుడు అక్కం స్వామి,జిల్లా కాంగ్రెస్ నాయకులు నరెందర్ రెడ్డి,సర్పంచ్ ప్రేమల చంద్రారెడ్డి,నాయ కులు గొడుగు దామోదర్, సయ్యద్ అన్సర్,కనక య్య, బసిరుద్దీన్, స్వామియాదవ్,డిలర్ వెంకట రెడ్డి,బాల్ రాజ్, కొండల్ రెడ్డి,గ్రామ యువకులు వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో క్రీడాకారు లు,ప్రజా ప్రతినిధులుపాల్గొన్నారు.క్రీడలు విజయ వంతం చేసిన ప్రతి ఒక్కరికీ స్వామి యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.
Spread the love