- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర మంత్రులతో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం కానున్న సీజేపీ నాయకులు ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు మంత్రులతో జరిగిన రెండు సమావేశాల్లో పెట్టిన తమ డిమాండ్లు తప్పక నెరవేర్చాల్సిందేనన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని, ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఒకవేళ ప్రధాన్తో రాజీనామా చేయించలేని పక్షంలో ప్రధాని మోడీనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సీజేపీ ‘ఎక్స్’లో పోస్టు చేసింది.
- Advertisement -



