పింఛన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

నవతెలంగాణ – అమరావతి: ఏపీలో ‘ఎన్టీఆర్‌ భరోసా’ పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది.  కూటమి ప్రభుత్వం చేపట్టిన తొలి అతిపెద్ద కార్యక్రమం. రూ.7,000 చొప్పున పింఛను అందజేయడమనేది దేశ చరిత్రలోనే ఒక రికార్డు. గుంటూరు జిల్లా పెనుమాకలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేశ్‌తో కలిసి ఆయన మంగళగిరి నియోజకవర్గం పెనుమాక చేరుకోగా.. ఆయనకు స్థానికులు ఘనస్వాగతం పలికారు.

Spread the love