నవతెలంగాణ – హైదరాబాద్: విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ నెల 6న ప్రజాభవన్ వేదికగా చర్చిద్దామని ఆయన చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.