నాటు సారా ఘటన: 34కు చేరిన మృతులు.. రూ.10 లక్షల పరిహారం ప్రకటన

నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులోని కల్లకురిచ్చిలో కల్తీ నాటుసారా తాగి మరణించిన వారి సంఖ్య 34కి పెరిగింది. మృతుల కుటుంబాలకు సీఎం స్టాలిన్ రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50,000 ఇస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోకుల్ దాస్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. 3 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించామన్నారు.

Spread the love