పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరికి బాధ్యత: కమిషనర్ శ్రీను

నవతెలంగాణ – నాగార్జునసాగర్
పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని నందికొండ మున్సిపాలిటీ కమిస్నర్ దండు శ్రీను అన్నారు.బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నందికొండ మున్సిపాలిటీ చైర్పర్సన్ అన్నపూర్ణ,3వ వార్డు కౌన్సిలర్ ప్రత్యేక సలహాదారుడు రమావత్ మోహన్ నాయక్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యంతో పర్యావరణం కలుషితమవుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరూ కనీసం ఐదు మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love