వారాంతపు సంత వేలం నిర్వహణ..

– నిర్ణయ ధర కంటే రూ.51,100 లు అదనంగా రాబడి..
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మేజర్ పంచాయతీ లో ప్రతీ  బుధవారం నిర్వహించే వారాంతపు సంత వేలంను గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో మండల పంచాయతీ అధికారి సీతారామరాజు ఆధ్వర్యంలో ఈ.ఓ గజవల్లి హరిక్రిష్ణ అద్యక్షతన నిర్వహించారు. నిర్ణయ ధర రూ.50 వేలు కంటే రూ.51 వేయి 100 లు అదనంగా అనగా రూ.1 లక్షా 11 వందలు ధర పలికింది. వారాంతపు సంత నిర్ణయ ధర రూ.38, 000 లు కాగా, రూ.82  వేల 5,00 లు,సంత ప్రాంగణంలోని 2 గదులు కు నిర్ణాయక ధర  రూ.12 వేలు కాగా రూ.18 వేలు 6 వందలు పలికింది. ఈ వేలం 14 మంది దరఖాస్తు చేసుకోగా సంత ను పమిడి లక్ష్మణరావు కైవసం చేసుకోగా,2 గదులను తోట నాగేశ్వరరావు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితి క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love