పూజలో పాల్గొన్న కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం ఆందోల్ మైసమ్మ తల్లి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిను చౌటుప్పల్ పట్టణంలో జరిగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పరిచయం చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పబ్బు రాజు గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ చెన్నగొని అంజయ్య గౌడ్ చౌటుప్పల్ కాంగ్రెస్ బ్లాక్ మండల పట్టణ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి బోయ దేవేందర్ సుర్వి నరసింహ గౌడ్ తండు మల్కాపురం ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు గ్రామ శాఖ అధ్యక్షులు మునుకుంట్ల రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love