రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

– కుంభం అనిల్ కుమార్ రెడ్డి 
నవతెలంగాణ- భువనగిరి: భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నదని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ నెల కరెంటు బిల్లు ఎవరు కట్టవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నారు. రైతు రుణము రెండు లక్షల మాఫీ చేస్తుందని తెలిపారు భువనగిరి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. అభివృద్ధి అంటే రోడ్లు, మురుగు కాలువలే కాదని విద్యా, వైద్యము, ఆరోగ్యం , అది ఉద్యోగము ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడమని తెలిపారు. పైల శేఖర్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల మీద అభిమానం లేదని తెలిపారు. 10 ఏళ్లలో కనీసం వారిని, భువనగిరి నియోజకవర్గం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర కార్యదర్శి ప్రమోద్ కుమార్ పిసిసి సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్ సీనియర్ నాయకులు బి సు కుంట్ల సత్యనారాయణ కే సోమయ్య కూర వెంకటేష్ పాల్గొన్నారు.
Spread the love