ఓటర్లకు కృతజ్ఞతలు: కాంగ్రెస్ నేత చెన్నకేశవ రావు 

నవతెలంగాణ – అశ్వారావుపేట
కాంగ్రెస్ అభ్యర్ధి రామ సహాయం రఘురామిరెడ్డి కి ఓట్లు వేసి అశ్వారావుపేట నియోజక వర్గం లో అత్యధిక ఆధిక్యత కట్టబెట్టిన ఓటర్లకు,పార్టీ శ్రేణులకు రాజకీయ మద్దతు ధర్మం పాటించి కాంగ్రెస్ విజయం కోసం కృషి చేసిన సీపీఐ(ఎం),సీపీఐ నాయకులకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవరావు  హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన బుధవారం అశ్వారావుపేట లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.  ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కో – ఆప్షన్ సభ్యులు ఎస్కే.పాషా,అనంతారం మాజీ సర్పంచ్ దాసరి నాగేంద్ర,దాసరి రవి,జల్లిపల్లి దేవరాజు, సత్యవరుపు బాలగంగాధర్, వాంకుడోత్ శోభన్,గుగులోతు రత్నం,ముల్లగిరి కృష్ణ,దాసరి రాము,కాగితాల సత్యనారాయణ,ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ తగరం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love