రేవంత్ రెడ్డిని సీఎం గా ప్రకటించడంతో కాంగ్రెస్ నాయకుల సంబరాలు..

నవతెలంగాణ-తొగుట
తెలంగాణ ప్రజల కల సహకారం చేసిన సోనియా గాంధీ ఋణం తీర్చు కునే అవకాశం కలిగిందని  ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ
మండల అధ్యక్షులు అక్కం స్వామి లు అన్నారు. మంగళవారం రేవంత్ రెడ్డిని అధిష్టానం ముఖ్య మంత్రిగా ప్రకటించిన సందర్బంగా మండల కేంద్రం లో తొగుట మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో  టపాకాయలు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కల సహకారం చేసిన తల్లి సోనియా గాంధీ  ఋణం తీర్చుకునే అవకాశం రాష్ట్ర ప్రజలకు కలి గిందని హర్షం వ్యక్తం చేశారు. 9 సంవత్సరాల నుండి అరాచక బానిసత్వ పాలన అంతం అయ్యిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రజలు కోరుకున్న ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీతో సాధ్యమ వుతుందని ధీమా వ్యక్తం చేసారు.తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలకు కాంగ్రెస్ ప్రభు త్వం నెరవేరస్తుందని తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ శాసనసభపక్ష నేత గా ప్రకటించినందుకు అధిష్టాననికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు భూపాల్ రెడ్డి,మల్లారెడ్డి,మాజీ ఎంపీపీ గంట రేణుక రవీందర్,మాజీ సర్పంచ్ కొంగరి నర్సింలు కాంగ్రెస్  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love